BREAKING: కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రతి పౌరులు మాస్కు ధరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అయితే ఇకపై ఒంటరిగా వెళ్లే బైక్ వాహనదారులు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా సైకిల్, బైకులపై ఒంటరిగా వెళ్లే వాహనదారులు కరోనా ఆంక్షలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు తీవ్ర విమర్శలు సైతం చేస్తున్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సైకిల్, బైకులపై ఒంటరిగా వెళ్లే వారికి మాస్కు తప్పని సరి కాదని ప్రకటించింది. సైకిల్, బైకులపై ఒంటరిగా వెళ్లేవారు మాస్కులు ధరించడం వారి ఇష్టమని స్పష్టం చేసింది. ఇకపై వారు మాస్కులు ధరించకపోతే చలాన్లను విధించ వద్దని కేంద్రం అధికారులను ఆదేశించింది.