తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా భారీగా విస్తరించి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 150 మందికి పైగా సిబ్బంది టీటీడీ లో ఈ వైరస్ బారిన పడ్డారు.
కొద్ది రోజుల క్రితం శ్రీ వారి మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితులు కూడా ఈ కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడగా ఆయన స్విమ్స్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస దీక్షితులు చికిత్సపొందుతూ మరణించడం జరిగింది.
75 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీనివాస దీక్షితులు తిరుమల శ్రీ వారి దేవస్థానంలో 30 ఏళ్లకు పైగా అర్చకుడి హోదాలో సేవలందించారు. ఇక మాజీ ప్రధాన అర్చకుడు అయిన దీక్షితులు మృతి టిటిడి అధికారులు మరియు యాజమాన్యాన్ని కలచివేసింది.