Breaking: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారమై జైలులో ఉండగా, తాజాగా ఈ వ్యవహారంలో మరో పేరు తెరమీదకు వచ్చింది. యంగ్ హీరోయిన్ ఇంటికి వెళ్లి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆ హీరోయిన్ ఎవరంటే..
White Spots: గోళ్ళపై తెల్లమచ్చలు ఉంటే ప్రమాదమా..!?
క్రూయిజ్ షిప్ పార్టీలో ఓ నటితో ఆర్యన్ వాట్సాప్ చాటింగ్..
ముంబైలోని క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా, తాజాగా తమకు అందిన సమాచారం మేరకు ఎన్సిబి అధికారులు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనన్య పాండేకు చెందిన ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే అనన్యా పాండేను విచారించేందుకుగాను ఆమెకు సమన్లు జారీ చేశారు అధికారులు. గురువారం ఆఫ్టర్నూన్ రెండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చినట్లు సమచారం. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అనన్యా పాండే ఫోన్ను కూడ ఎన్సిబి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం విచారణ సందర్భంలో క్రూయిజ్ షిప్లో పార్టీ సందర్భంగా ఆర్యన్ ఖాన్ ఓ నటితో వాట్సాప్ చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లో సోదాలు చేయడాన్ని బట్టి చూస్తే ఆర్యన్ ఖాన్ చాట్ చేసింది అనన్యతోనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Bigg Boss 5 Telugu: ఆ ఒక్క పదంతో అమాంతం పడిపోయినా ప్రియ ఆంటీ గ్రాఫ్..!!
ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరయ్యేనా?
మరో వైపు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన తనయుడిని చూసేందుకుగాను జైలుకు వెళ్లారు. షారుఖ్ జైలు నుంచి తిరిగి వెళ్లిన కొద్దిక్షణాల్లోనే ఎన్సిబి అధికారులు షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్లడం గమనార్హం. ఇకపోతే ప్రత్యేక కోర్టు ఆర్యన్ ఖాన్కు బెయిల్ ఇవ్వడానికిగాను నిరాకరించింది. ప్రాథమికంగా నిందితుడు అయినటువంటి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కార్యకలాపాల్లో ఉన్నట్లు నిరూపణ అయ్యే చాన్సెస్ ఉన్నట్లు కోర్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు తీర్పు రాగానే నిందితుల తరఫు లాయర్స్ బాంబే హైకోర్టుకు వెళ్లారు. కాగా, హై కోర్టు ఈ ఈ కేసును ఈ నెల 26న విచారించనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?