Tirupati: దక్షిణ భారత దేశంలో తిరుపతి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల నుంచి తిరుపతికి స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా అందరూ వచ్చి దర్శించుకునే పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది తిరుపతి దేవ స్థానం. అయితే ఇప్పుడు తిరుపతిలో కూడా చాలా రకాల ఆంక్షలు తెరమీదకు వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇక కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు బాగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు రెడీ అయిపోయింది టీటీడీ.
ప్రముఖులకు మాత్రమే దర్శనం..
ఈనెల నుంచే కొన్ని ఆంక్షలను తీసుకొస్తోంది. నవంబర్ 14వ తేదీన, అలాగే 29వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో స్వామి దర్శనాలను టీటీడీ 13,14,15 తేదీల్లో రద్దు చేస్తున్నారు. ఇందులో కేవలం బ్రేక్(VIP Darshan) దర్శనాలనే రద్దు చేస్తున్నామని, ఇతర సేవా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ టీటీడీ వెల్లడించింది. అయితే ఈ మూడు రోజుల్లో అందరకీ కాకుండా కేవలం ప్రముఖులకు మాత్రమే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లను పంపిణీ చేస్తోంది టీటీడీ. ఇదే విషయాన్ని టీటీడీ(TTD) వెల్లడించింది.
అమిత్ షా ఆధ్వర్యంలో సదస్సు..
దక్షిణాది రాష్ట్రాల సదస్సు నేపథ్యంలో భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఒక ప్రకటలో వివరించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అయినటువంటి అమిత్షా దక్షిణాది రాష్ట్రాల భద్రత నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు వస్తున్నారు. ఇందులో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రముఖుల సదస్సు నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి తమకు సహకరించాలంటూ టీటీడీ పాలకవర్గం ప్రజలను కోరింది.