BREAKING: వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. పరిపాలన రాజధాని విశాఖపట్నాన్ని మారుస్తామని సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన అడుగులకు న్యాయపరమైన చిక్కులు బ్రేక్ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ జగన్ కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రంలో ఒక ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది.
BREAKING: భారత్ కు మరో సిల్వర్ మెడల్..!
ఇటీవల అన్ని రాష్ట్రాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చెప్పాలంటూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు అడిగారు. వారి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ ఒక రాతపూర్వక ప్రకటన ఇచ్చింది. ఈ రాతపూర్వక వివరణలో ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంది కేంద్రం. దాంతో జగన్ నిర్ణయానికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా వైజాగ్ ను కేంద్రం గుర్తించిందా? అనే అంశం చర్చనీయాంశం అయింది. ఈ రాతపూర్వక ప్రకటనను సాక్షాత్తు మంత్రి హర్దీప్ సింగ్ పూరి జారీ చేయడంతో.. జగన్ నిర్ణయానికి తిరుగు లేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.