Breaking: ఈ రోజు అంటే అక్టోబర్ 10న ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్ల పర్వం ముగిసింది. రెండు గంటల క్రితమే మా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆరంభమైంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అత్యధిక పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2019లో 474 ఓట్లు నమోదు కాగా ఈసారి ఏకంగా 665 ఓట్లు నమోదయ్యాయి. కేవలం రెండు గంటల్లోనే 250కి పైగా ఓట్లు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత ఉత్కంఠభరితంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 83 శాతం ఓటింగ్ నమోదు కావడం మా ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇందులో 60 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదు కావడానికి అధ్యక్ష పదవి పోటీదారుడు మంచు విష్ణుయే కారణమని స్పష్టమవుతోంది. ఈ కొత్త ఓటర్లు అందరూ మంచు విష్ణుకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో విష్ణు కచ్చితంగా గెలుస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Maa Election’s: “మా” ఎలక్షన్స్ నేపథ్యంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి సంచలన కామెంట్స్..!!
మా ఎన్నికల అధ్యక్షుడి సీటు ఎవరిని వరించనుంది..
ఇప్పటివరకైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితాలలో విష్ణుదే పైచేయిగా నిలిచింది. ఇక మిగతా 605 ఓట్లలో ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ నరాలు తెగే పరిణామాల మధ్య ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ప్యానల్ సభ్యుల మొహాల్లో తీవ్ర టెన్షన్ వ్యక్తమవుతోంది. ఫలితాలు కొద్ది నిమిషాల్లోనే తేలనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంచు విష్ణు ఈ ఎన్నికల్లో గెలవడం ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఆయన ఓటింగ్ మేరకు ముంబయి, ఢిల్లీ, బెంగళూరు నుంచి నటీనటులను జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి ప్రత్యేకంగా పిలిపించారని టాక్ నడుస్తోంది.
MAA Elections: బండ్ల గణేశ్ మార్క్ ప్రచారం..!!
ప్రకాష్ రాజ్ గెలుస్తారా
ఇక ప్రకాష్ రాజ్ సైతం అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు పట్టుబట్టారు. అందరికంటే ఆయనలోనే ఎక్కువ ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. అతనికి మెగా కుటుంబం నుంచి సపోర్ట్ అందుతుందని వినికిడి. అయితే ఎన్నికలను క్షుణ్ణంగా విశ్లేషిస్తే మంచు విష్ణు గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం 60 శాతం ఓట్లు విష్ణు కే పడినట్లు కూడా తెలుస్తోంది.
MAA Elections: ఉద్రిక్తతల నడుమ ప్రశాంతంగా ‘మా’ ఎన్నికల పోలింగ్..!!