BREAKING: ప్రముఖ మీడియా దిగ్గజం ‘సోనీ ఇండియా’లో విలీనం అయ్యేందుకు ‘జీ ఎంటర్టైన్మెంట్’ తాజాగా అంగీకరించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కంపెనీని విలీనం చేసేందుకు బోర్డు ఆమోదించిందని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ బుధవారం వెల్లడించింది. అయితే విలీన సంస్థలోనే సోనీ ఇండియా వాటాదారులు మెజారిటీ వాటాను కలిగి ఉంటారని జీ మీడియా స్పష్టం చేసింది.
<img class="alignnone wp-image-214824 size-full" src="https://newsorbit.com/wp-content/uploads/2021/09/New-Project-2021-09-22T082637.024.jpg" alt="" width="690" height="480" /
విలీన సంస్థకు సైతం జీ అధిపతి పునిత్ గోయెంకానే సీఈఓగా కొనసాగుతారని వెల్లడించింది. పునిత్ గోయెంకా ఐదేళ్ల పాటు విలీన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా విధులు నిర్వహించనున్నారు. అయితే బోర్డు డైరెక్టర్ల మెజారిటీని నామినేట్ చేయడంలో సోనీ గ్రూప్ సంయుక్త సంస్థకే అధికారం ఉంటుంది.
Rajashekar : రాజశేఖర్ కూతుళ్ళు స్టార్ హీరోయిన్స్ అవుతారా..?