Marriage: సాధారణంగా పెళ్లి అనగానే మనకి బంధువులు, స్నేహితులు, పెళ్లి పనులు హడావిడి గుర్తొస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల విషయానికి వస్తే ఇది ఇంకాస్త వేరుగా ఉంటుంది. కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి ఎంతో కుతూహలంతో ఎన్నో ప్ప్లాన్స్ వేసుకుంటూ బంధువుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఎప్పటికి తమ జీవితంలో ఆ రోజు గుర్తుండిపోయేలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఉంది ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పెళ్లి జంట చేసిన పని. అదేమిటంటే వధువు మరియు వరుడు ఇద్దరు పెళ్లి పీటల మీద లేచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువతికి రక్తదానం చేశారు.
పెళ్లి రోజున పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ఎంత బిజీ గా ఉంటారో మనకు తెలిసిందే. కానీ అటువంటి సమయంలో కూడా ఈ జంట భాద్యతగా చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అశిశ్ మిశ్రా తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రజలకు తెలియజేసారు. ఆయన ట్విట్టర్ చేసిన ట్వీట్ కి అనూహ్యరీతిలో రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలంగా పోలీస్ మిత్రా క్యాంపెయిన్ ను రన్ చేస్తున్నారు ఆశిష్ మిత్ర.
ఈ క్యాంపెయిన్ ద్వారా రక్తం అవసరమయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెషేంట్లకు అది సమకూర్చేలా తనవంతు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువతి ప్రాణాలు కాపాడడానికి రక్తం కావాలని ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యగా పెళ్లి వేడుక లో ఉన్న ఈ పెళ్లి జంట ముందుకువచ్చి రక్తదానం చేసారు. ఇది చుసిన నెటిజన్లు ఆ నవ వధూవరుల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?