ఈ మధ్య పీటల దాకా వచ్చి పెటాకులు అయిన పెళ్లిళ్ల ఘటనలు అనేకం చూశాం. ఆ మధ్య ఒక వధువు అందరిముందే తన ప్రియుడికి ముద్దు ఇచ్చింది. తాజాగా ఓ యువతి పెళ్లి పీటల పైన కూర్చుని తాను తాళి కట్టించుకోనని మొండికేసింది.
తన ప్రియుడు వస్తాడంటూ హడావిడి చేసింది. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో వధువు చేసిన పని హాట్ టాపిక్గా మారింది.పోలీసులను పిలిపించుకొని మరీ తన పెళ్లిని ఆపుకొని వధువు వెళ్లిపో పోవడం పెద్ద వెరైటీ కాకపోవచ్చు గానీ ఆ తర్వాతే ఈ మ్యారేజీలో మరో ట్విస్ట్ జరిగింది.మహబూబాబాద్ జిల్లా మరిపెడ లోఏం జరిగిందో మీరే చదవండి !
ఇష్టం లేని పెళ్లి ని ఆపేయించుకున్న వధువు!
వివరాల్లోకి వెళ్తే.. మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆ యువతి… పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేని వధువు ఏకంగా పెళ్లి మండపం నుంచే పోలీసులకు ఫోన్ చేసింది. ఈ పెళ్లిని ఎలాగైనా నిలిపివేయాలని వేడుకుంది. స్పందించిన మరిపెడ సీఐ సాగర్, ఎస్సై అశోక్ పెళ్లి మండపం వద్దకు వచ్చి..పెళ్లి ఆపి.. విచారణ చేపట్టారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా యువతి వినకపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. అనంతరం యువతిని పోలీసులు కౌన్సెలింగ్ కోసం సఖి సెంటర్కు తరలించారు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే !
ఇంతటితో ఈ ఉదంతం ముగిసిపోయి ఉంటే అదేమీ పెద్ద వార్త కాదు.అసలు పెళ్లి కూతురు వెళ్లిపోయిన తర్వాతే మరో వింత చోటు చేసుకుంది. అంతమంది అతిథుల మధ్యలో పెళ్లి ఆగడం అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు ఎలాగైనా సరే అదే ముహూర్తానికి తన కుమారుడికి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు.అప్పటికప్పుడు అమ్మాయి కోసం గాలించారు. ఇదే వివాహానికి హాజరైన సమీప బంధువుల అమ్మాయి వారికి బాగా నచ్చేసింది.మరేమీ ఆలోచించకుండా ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి కూతురుని చేసేసి అదే కల్యాణమండపంలో అదే ముహూర్తానికి అప్పటికప్పుడే వివాహం కూడా ముగించేశారు.ఇదే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ట్రెండింగ్ సబ్జెక్ట్!