ఈజిప్టు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు కాప్ – 27లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సదస్సుకు హజరైన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ అర్ధాంతరంగా సదస్సు మధ్యలోనే వెళ్లిపోవడం తీవ్ర సంచలనం అయ్యింది. రుషి సునాక్ అర్ధాంతరంగా సమావేశం నుండి వేగంగా వెళ్లడంతో ఏమి జరిగింది..? ఎందుకు అంత హడావుడిగా వెళ్లారు..? అనేది అర్ధం కాక అక్కడ ఉన్న సభ్యులంతా గందరగోళానికి గురైయ్యారు. ఈ సమావేశం నుండి రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యూకేకు చెందిన కార్బన్ భ్రీఫ్ అనే మీడియా వైబ్ సైట్ డైరెక్టర్ లియో హికమన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “కాప్ – 27 సదస్సులో భాగంగా అడవుల పరిరక్షణ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. రిషి సునాక్ మధ్యలోనే వెళ్లిపోయారు’ అని హికమన్ ట్వీట్ చేశారు. “బ్రిటన్ ప్రధాని వేదికపై కూర్చుని ఉండగా ఆయన సిబ్బంది ఒకరు వచ్చి సునాక్ చెవిలో ఏదో చెప్పారు. దాని గురించి వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. అప్పటికీ రుషి అలాగే కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటికి మరో సిబ్బంది వచ్చి రిషిని అక్కడి నుండి వెళ్లిపోదామని కోరారు” అని హికమన్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది జరిగిన రెండు నిమిషాలకే రిషి వేదికపై నుండి దిగి తన సిబ్బందితో కలిసి హడావుడిగా సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే రిషి చెవిలో సిబ్బంది ఏం చెప్పారు. ఆయన హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారు అన్నది తెలియరాలేదు.
గత ఆదివారం కాప్ 27 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు తొలుత రిషి హజరుకాకూడదని భావించారు. దీంతో ఆయనపై విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని సమావేశాల్లో పాల్గొని పర్యావరణ మార్పులపై ప్రసంగించారు. కాగా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోకు 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
AP Police: ఏపిలో భారీగా డీఎస్పీల బదిలీలు
UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX
— Leo Hickman (@LeoHickman) November 7, 2022