పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బీటెక్ చదువుతున్న విద్యార్థి కాలేజ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తనెంతో కన్నీటి పర్యంతం అయ్యారు అని తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా తన ఆత్మహత్యకు కారణం తెలుపుతూ… బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి పరీక్షలలో ఫెయిల్ అవడం వల్ల ఎంతో మనస్థాపానికి గురయ్యానని తెలుపుతూ వీడియో చిత్రీకరించి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల కుమారుడు తిరుమలేష్..ప్రస్తుతం ఏలూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆ దంపతులిద్దరికీ తిరుమలేష్ ఒకే కుమారుడు కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. తన కొడుకు చదువు లో మంచిగా రాణించి విదేశాలకు వెళ్లాలని తమ తల్లిదండ్రులు ఆశపడే వారు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న తిరుమలేష్ పరీక్షలలో ఫెయిల్ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.
తిరుమలేష్ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీశాడు. అందులో తను జీవితంలో ఫెయిల్యూర్ అయ్యానని.. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కోరికను నెరవేర్చలేక పోతున్నానని, ఎంత చదివినా ముందుకు రాలేక పోతున్నాను ఇలాంటి ఎదవ కొడుకుకి జన్మనిచ్చి చాలా తప్పు చేసావమ్మా… నన్ను క్షమించమ్మా ఇక సెలవంటూ, కన్నీటి పర్యంతమై ఆ వీడియోని చిత్రీకరించిన తిరుమలేష్ వాట్సాప్ గ్రూప్ ద్వారా తన మిత్రులకు పంపించి బుధవారం(జనవరి 6) కాలేజ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావంలో ఉన్న అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారించారు. చనిపోయిన తమ కుమారుని నేత్రాలను ఆ తల్లిదండ్రులు ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేయడం ఎంతో విశేషం.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…