Alcohol: తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2021-22 ఆర్ధిక సంవత్సర Budget లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ ఇలా అన్ని విభాగాలలో కొత్త కొత్త ప్రతిపాదనలు చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ మరియు ఆల్కహాల్ ఇలా పలు విదేశీ దిగుమతి వస్తువులపై కేంద్రం (AIDC) సెస్ విధించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మద్యం పైన కూడా 100 శాతం అగ్రి సెస్ ను ప్రకటించడంతో మందుబాబులు షాక్ కు గురయ్యారు.
ఇప్పటికే కరోనా వలన గత కొద్ది కాలంగా మన దేశంలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. కరోనా వల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ లాగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా గాడితప్పడంతో ఇప్పటికి ధరలు పెరిగాయిలే అని అన్నారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన బడ్జెట్ లో కేంద్రం మళ్ళి అగ్రి సెస్ ను వర్తింపజేయడంతో దేశంలో మరోసారి మద్యం ధరలు పెరుగుతాయని మందుబాబులు కంగుతిన్నారు.
కానీ తాజాగా కేంద్రం ప్రతిపాదించిన అగ్రిసెస్ వలన మద్యం ధరల్లో ఎటువంటి పెరుగుదల ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యడంతో మందుబాబులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఇంపోర్టెడ్ మద్యంపై కేంద్రం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ ని విధించగా ఇక ఇప్పటి నుంచి దాన్ని ఏకంగా 50 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.
అంటే మద్యంపై కస్టమ్స్ డ్యూటీ మరియు AIDC మొత్తంగా కలిపి 150 శాతానికే పరిమితం కానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. మన దేశంలో మద్యం విక్రయం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్రానికి కూడా అధిక ఆదాయం వస్తుందన్న సంగతి విదితమే. ఈ కారణంగానే మద్యం కు కేంద్రం GST నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.