Budget 2022: ఓ వైపు కరోనా మహమ్మారి కష్టాలు.. మరోవైపు విదేశాల నుండి తీవ్ర పోటీ.., మరోవైపు కేంద్రం కూడా దిగుమతి సుంకం పెంచిన కారణంగా దేశంలోని రొయ్య ఉత్పత్తిదారులు నష్టపోతున్నట్టు ఆ సంఘం పేర్కొంది. తమ ఇబ్బందులు, అందుకు గల కారణాలు పేర్కొంటూ.. వచ్చే బడ్జెట్ లో తమకు సహకారం అందించాలని కోరుతూ ఆ సంఘం తరపున అధ్యక్షులు మోహన్ రాజు నేతృత్వంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కి లేఖ రాశారు. రొయ్యలు, చేపల ఫీడ్ పై 2021 బడ్జెట్ కి ముందు 5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని.. 2021లో 15 శాతంగా పెంచారని.. తద్వారా ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని.. కేంద్రం తక్షణమే స్పందించి దాన్ని మళ్ళీ 5 శాతానికి తగ్గించాలని కోరుతూ లేఖని విడుదల చేశారు.. ఈ లేఖలో ఇంకా ఏమున్నాయంటే..!
* దేశంలోని రొయ్య ఉత్పత్తిదారులు వరుసగా ఆరేళ్లపాటు మన దేశాన్ని రొయ్య ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలిపారు. కానీ.. విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి వ్యవమ్ పెరగడం, ఫీడ్ ధర కూడా పెరగడంతో కొన్ని నెలలుగా వరుసగా నష్టాలు వస్తున్నాయి. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలను దాదాపు 90 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.., కానీ విదేశాల నుండి నాణ్యమైన ఫీడ్ మాత్రం సరైన ధరకు రావడం లేదు.
* కరోనా మహమ్మారి కారణంగా ఫీడ్ ధర 35 శాతం పెరిగింది. 5 శాతం నుండి 15 శాతానికి దిగుమతి సుంకం పెంచిన కారణంగా ఉత్పత్తిదారులకు మరింత ఆర్థికభారం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మన దేశమే రోయ్య్య, చేపల ఫీడ్ వినియోగంలో అగ్రగామిగా ఉంది. కానీ ఇప్పుడు ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ ధర ఉంది. గతంలో రూ. 500 కోట్లు ఉండే నికర ఆదాయం ఈ ఏడాది రూ. 305 కోట్లకు పడిపోయింది. దిగుమతి సుంకం పెంచక ముందు ఏటా 60 వేల టన్నుల ఫీడ్ దిగుమతి చేసేవారు. కానీ 3.5 శాతం మాత్రమే దేశీయంగా వినియోగించేవారు. కేంద్రం ఈ అంశాలపై స్పందించి.. ఈ ఏడాది బడ్జెట్ లో దిగుమతి సుంకం విషయంలో పునరాలోచించాలని కోరారు..!