గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిధిలాలలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున ఐదు గంటలకు జరిగింది. శిధిలాలలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ కాంక్రీట్, ఇనుప గ్రిల్స్ తొలగించే పనులు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి ఇషామ్ సింగ్ చెప్పారు. ఘజియాబాద్, ద్వారక నుండి ఎన్డిఆర్ఎఫ్కు చెందిన మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
previous post
next post