సాధారణంగా ఒక హీరోయిన్ తో వర్క్ చేసిన దర్శకులు కంటిన్యూస్ గా అదే హీరోయిన్ ని నెక్స్ట్ సినిమాలకి ఎంచుకోవడానికి చాలా లెక్కలుంటాయి. ముఖ్యంగా ట్యూనింగ్ అవడం. మల్టీ టాలెంటెడ్ గా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలిగే సత్తా.. ఒప్పుకున్న సినిమా పట్ల డెడికేషన్.. ఇలా చాలా విషయాలను దర్శకులు పరిగణలోకి తీసుకుంటుంటారు. ఇలా టాలీవుడ్ లో హీరోయిన్స్ ని తన సినిమాలలో రిపీట్ చేసే దర్శకులలో మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఉంటారు. ఆయన సినిమాలో హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
అందుకు తగ్గట్టుగానే తన సినిమాలలో హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. అంతేకాదు ఒక హీరోయిన్ తో వరసగా 2 – 3 సినిమాలు చేసే అలవాటుంది మాటల మాంత్రీకుడికి. హీరోయిన్స్ కూడా గురూజీ గా భావిస్తూ ఆయన దర్శకత్వంలో నటించడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. ఆ లిస్ట్ లో సమంత, పూజా హెగ్డే, ఇలియానా ముఖ్యంగా చెప్పాలి. ఇలియానా ముందు జల్సా సినిమాలో నటించింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. త్రివిక్రం తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత కూడా ఇలియానా కి జులాయి సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇలియానా కి రెండు హిట్స్ ఇచ్చారు త్రివిక్రం. ఆ తర్వాత సమంత కూడా త్రివిక్రం దర్శకత్వం వహించిన సినిమాలలో వరసగా నటించింది. పవర్ స్టార్ పన కళ్యాణ్ హీరోగా అత్తారింటికి దారేది.. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్య మూర్తి..యంగ్ హీరో నితిన్ నటించిన అ..ఆ సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది.
కాగా పూజా హెగ్డే కూడా త్రివిక్రం దర్శకత్వం వహించిన అరవింద సమేత .. అల వైకుంఠపురములో నటించి బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే త్వరలో త్రివిక్రం దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ .. తన 30 వ సినిమా చేయబోతున్నాడు.
కాగా ఈ సినిమాలో ఇన్నాళ్ళు పూజా హెగ్డే గాని కీర్తి సురేష్ గాని హీరోయిన్స్ గా నటిస్తారని వార్తలు రాగా తాజాగా రొమాంటిక్ అన్న సినిమాలో నటించిన యంగ్ బ్యూటీ కేతిక శర్మ ని తీసుకోబోతున్నట్టు టాక్ మొదలైంది. ఇటీవల ఆహా కోసం త్రివిక్రం తీసిన యాడ్ ఫిల్మ్ లో అల్లు అర్జున్ తో కలిసి కేతిక నటించింది. ఆ సమయంలో కేతిక డెడికేషన్ త్రివిక్రం ని బాగా ఇంప్రెస్ చేసినదట. అందుకే త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో తీయబో సినిమాలో అవకాశం ఇచ్చారని సమాచారం.