సరిగ్గా లాక్ డౌన్ ముందు బండి సంజయ్ అధ్యక్ష పీఠం చేపట్టారు. దీంతో బీజేపీ కిందిస్థాయి క్యాడర్ కి తనని తాను పరిచయం చేసుకోవడానికి కరోనా అడ్డు పడినా గాని దుబ్బాక ఉప ఎన్నికలలో అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలలో తన మాస్ తరహా పంతతో దూసుకుపోయారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాగాని వారి కంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెప్పవచ్చు.
దీంతో బండి సంజయ్ నాయకత్వంపై ఢిల్లీ పెద్దలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కి ఢిల్లీ నుండి పిలుపు అందినట్లు పార్టీ లో టాక్ నడుస్తుంది. ఈ ఆదివారం ఢిల్లీ పర్యటన బండి సంజయ్ చేపట్టనున్నట్లు.. , ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి కొంత మంది నేతలతో బేటీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జిహెచ్ఎంసి ఎన్నికలలో పార్టీ ఏ విధంగా ముందుకు పోయిందో వంటి విషయాలు పార్టీ హైకమాండ్ కి తెలియజేసి, ఎన్నికల ప్రచారంలో భాగస్వాములైన వారికి కూడా ఈ పర్యటనలో బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పనున్నట్లు టాక్. ఓటింగ్ పరంగా చూసుకుంటే స్పష్టమైన మెజారిటీతో కమలం పార్టీ గ్రేటర్ లో రాణించడంతో కాషాయ నాయకులు ఫుల్ జోష్ గా ఉన్నారు. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్ 60 దాటాకపోవడంతో హాంగ్ తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?