తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బిజెపి మంచి జోరు మీద ఉంది. దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు భారీ స్థాయిలో బిజెపి ప్రజల మన్ననలు అందుకోవడంతో బండి సంజయ్ దూసుకుపోతున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ నే లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల జగిత్యాలలో పర్యటించడానికి రెడీ అయిన బండి సంజయ్ ని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవటానికి ప్రయత్నాలు చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల లో బీజేపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడితే.. రాష్ట్రంలో టిఆర్ఎస్ మంత్రులు ఎవరు ఇంటి నుండి బయటకు ఒక్క అడుగు కూడా వేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తమపై దాడికి పాలు పడితే కచ్చితంగా ప్రతి దాడి చేస్తామంటూ హెచ్చరించారు. జగిత్యాల లో రైతులు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ కామెంట్లు చేశారు. ఇదే దేశంలో రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రైతులందరూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రైతులను పక్కదోవ పట్టించడానికి టిఆర్ఎస్ అదేవిధంగా మిగతా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రైతులను నిండా ముంచేశారు అని కేసీఆర్ పై మండిపడ్డారు. అంత మాత్రమే కాక రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.