టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని వారు ఉండరు. సినిమా హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా దేవిశ్రీ సమకూర్చిన మ్యూజిక్, సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాకి కూడా DSPనే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ వరల్డ్ వైడ్ గా హిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ని రాబట్టిన ఆల్బమ్గా పుష్ప రికార్డు సాధించింది. అయితే రీసెంట్గా దేవిశ్రీ ది వారియర్ సినిమాకి సంగీతం అందించాడు. ఈ మూవీలో ‘బుల్లెట్’ సాంగ్ తెలుగు, తమిళ్ భాషల్లో బాగా పాపులర్ అయింది. కానీ మ్యూజిక్ మాత్రం గురి తప్పిందనే చెప్పాలి. ఈ మూవీలో సీన్స్ని ఎలివేట్ చేసే రేంజ్లో లేవు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ ప్రతిభపై అనుమానం
పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభం కానుంది. ఆ సినిమాకి దేవినే సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. దేవి ది వారియర్ సినిమాలో అందించినట్లు ఇందులో కూడా సంగీతం అందిస్తే పుష్ప-2 సంక నాకి పోతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్పై సడన్గా ప్రేక్షకులకు భయం పుట్టుకురావడానికి మరో కారణం ఉంది. ఇటీవల రిలీజ్ అయిన కమల హాసన్ ‘విక్రమ్’ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. టాలీవుడ్ టాప్ హీరోలు అనిరుద్ అందించిన ఈ బీజీఎమ్ కి ఫిదా అయ్యారు. ఈ రేంజ్ బీజీఎమ్ మన మూవీలకూ కావాలని హీరోలు కోరుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించే మ్యూజిక్ మాత్రం కొత్తగా ఉండటం లేదు. ఎప్పుడూ అవే ట్యూన్స్, అదే మ్యూజిక్ వినట్లు ఉంటుందని ఇప్పటికే ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతను ఇంకా అప్డేట్ కావాలని అంటున్నారు.
ఇలా అయితే కష్టం
దేవిశ్రీ ‘ది వారియర్’కి అందించిన బీజీఎమ్ విన్న వారందరు పుష్ప -2 కి కూడా ఇలానే బిజీ ఎమ్ ఉంటే సినిమా కథ పరంగా బాగున్నా కూడా మ్యూజిక్ విషయం లో మాత్రం ఫ్లాప్ అవుతుందేమో అని బన్నీ ఫ్యాన్స్ హడల్ పోతున్నారు. అతను తన పాత మ్యూజిక్ ని వదిలేసి కాస్త కొత్తగా ప్రయత్నిస్తే గానీ పాన్ ఇండియా రేంజ్ అందుకోలేమని అంటున్నారు. మరి దేవిశ్రీప్రసాద్ అభిమానులకు రుచికి తగినట్లు మ్యూజిక్ అందిస్తారు లేదో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!