కరోనా వల్ల ఎంత మంది రోడ్డున్న పడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మహమ్మారి బారిన పడి ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ఈ మహమ్మారి దాటికి ఉన్న జాబ్ పోగొట్టుకుని రోడ్లవెంట తిరుగుతున్నారు. ఈ మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచిన మాట వాస్తవమే కానీ .. మానవత్వాన్ని మాత్రం బయటకు తీసిందని చెప్పాలి. దాంతో ఎంతో మంది తమకు తోచిన సాయం లేనివారికి, పని దొరకనివారికి చేశారు.
అలాగే ఒక దేశం ఇంకో దేశానికి సాయం చేసుకుంది. శత్రు దేశాలు సైతం మిత్ర దేశాలుగా మారిపోయాయి. ఈ సమయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడాల్సిన వ్యాపార సంస్థలు మనం అనే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. లాక్డౌన్ తో ప్రముఖ వ్యాపార సంస్థలు అన్నీ ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. దీంతో చాలా సంస్థలు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి వాళ్ల ఉద్యోగులను తక్కువ చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున్న పడతారు.
ఇలా ఉద్యోగులు రోడ్డున్న పడకుండా ఆదుకోవాలని యుకేలోని ప్రముఖ ఫుడ్ చైన్ వ్యాపార సంస్థ బర్గర్కింగ్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ తో ఎంతో మంది హృదాయాలను దోచుకుంది ఆ సంస్థ. అమెరికన్ బెస్డ్ ఫాస్ట్ఫుడ్ సంస్థ ఈ బర్గర్ కింగ్. అయితే ఇది చేసిన ట్వీట్ ఏంటంటే యూకేలోని మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, పాపా జాన్స్, టాకో బెల్స్ల ఫుడ్ను ఆర్డర్ చేసుకుని ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని కోరింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సంస్థకు ప్రసంశల జల్లు వచ్చింది.
ఈ సంస్థ ట్వీట్ లో మేము ఇలాంటి ట్వీట్ చేస్తామని ఎప్పడూ ఊహించలేదని పేర్కొంది. కానీ రెస్టారెంట్స్, ఫుడ్స్ వ్యాపార సంస్థల్లో పని చేసే వేలమంది ఉద్యోగులకు ఇప్పుడు మీ మద్దతు చాలా ముఖ్యమని పేర్కొంది. అందుకే కేఎఫ్సీ, మెక్డోనాల్డ్స్ లో ఆహారాన్ని కొనమని చెబుతోంది. వేల మంది ఉద్యోగులను కాపాడమని వేడుకుంటోంది. అయితే కరోనా కాలంలో జాగ్రత్త ఉండటం చాలా మంచి విషయమే.. కానీ ఒక నలుగురిని బతికించే మంచిపని కోసం బయటి ఆహారాన్ని ఆర్డర్ చేయడం అంత చెడ్డ పని కాదని పేర్కొంది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.