కర్నూలు, జనవరి 13 : కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో ఒక టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకువెళ్లింది. మహారాష్ట్ర నుండి శ్రీశైలం వెళుతుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36మంది ప్రయాణీకులు ఉన్నారు. ఘాట్ రోడ్డులో ప్రహరీకి బస్సు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బ్రైక్ ఫెయిల్ అవ్వడం వల్ల బస్సు అదుపుతప్పిందని డ్రైవర్ చెప్పాడు. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను గమ్యస్థానాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.