కొన్ని భయంకరమైన ఘటనలను చూస్తుంటే ఒళ్లు గగురు పాటుకు గురవుతుంటుంది. మరికొన్ని ఘటనలు చూస్తే వెన్నులో వణుకు వస్తుంటుంది. అయితే కొన్ని రోడ్డు ఆక్సిడెంట్స్ ను కళ్లారా చూసిన వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దెబ్బకు జ్వరంతో తల్లడిల్లుతారు. వామ్మో ఎలా డ్రైవ్ చేసుంటాడు.. అసలు ఇతనిదా తప్పు అవతలి వ్యక్తిదా అని తెగ ఆలోచిస్తుంటారు చాలా మంది. రాష్ డ్రైవ్ వల్లనో లేక అవతల వ్యక్తి పొరపాటు మూలంగానో కాని చాలా మంది మాత్రం రోడ్డు ప్రమాదాల్లో దారుణంగా మరణిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకొచ్చాయి.
అయినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గకపోగా రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది విమాన ప్రయాణం అంటే భయపడిపోతుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు విమానాల్లో మంటలు ఏర్పడి బూడిదై పోతాయి. అలా జరిగిన ఘటనలు ఎన్నో. అందుకే చాలా మంది విమాన ప్రయాణం అంటే వెనకడుగు వేస్తుంటారు. కాని ఈ మధ్యన బస్సులు కూడా ఇలాగే జరుగుతున్నాయి. చూస్తుండగానే బూడిదలాగా మారిపోతున్నాయి. సామాన్యులకు సైతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బస్సులు ఇలా మంటకు ఆహుతి కావడంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ప్రణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని బస్సులకు ఇలాంటి అనుకోని ప్రమాదం జరుగుతుందని చెప్పలేము. కాని జరిగిన వాటిని చాలా వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. సియాన్ పాన్వెల్ హైవే నుంచి ప్రయాణికులతో వెల్తున్న ఒక బస్సులో అకస్మాత్తుగా పొగలు చెలరేగాయి. దాంతో అలెర్ట్ అయిన ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం ముంచుకు రాకముందే బస్సులో నుంచి దిగేశారు. కాని ఒక వ్యక్తి బస్సులో చెలరేగిన మంటల్లో చిక్కుకున్నాడు.
నానా తంటాలు పడి ఆ ప్రయాణికుడిని చివరకు ప్రాణాలతో కాపాడారు. అయితే బస్సులోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడిండట. అందువల్లే బస్సులో మంటలు చెలరేగాయని తెలిసింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శరవేగంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే ఆ మంటలు పూర్తిగా బస్సును బూడిద చేసేసింది. కాని ప్రయాణికులు భద్రంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.