నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయములో వైయస్ జగన్ డైరెక్ట్ ఫైట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడుతూ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడంతో షోకాజ్ నోటీసులు అందుకున్న రఘురామకృష్ణంరాజు, ఈ విషయం ఢిల్లీలో తేల్చుకుంటా అని ఇటీవల భీరాలు పలికారు. దీంతో వైయస్ జగన్ చరిష్మా ని తక్కువ అంచనా వేసి ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణం రాజు కి పలకరించే వారే తక్కువ అయ్యారట. కేంద్ర మంత్రులు తూతూమంత్రంగా రాజు గారి మాటలు విన్నట్లు ఢిల్లీలో టాక్. అందువల్లే ఢిల్లీ బయలుదేరక ముందు వైయస్ జగన్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన రాజుగారు తర్వాత విజయసాయి రెడ్డి పై స్వరం మార్చినట్లు సమాచారం.
ముఖ్యంగా పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా జగన్ పార్టీ ఉండటంతో ఈ విషయంలో ఢిల్లీ నేతలు కలుగజేసుకోవటనికి జంకి నాట్లు… ఈ దెబ్బతో రఘురామకృష్ణంరాజుకి కూడా అంతా బోధపడి వెనకడుగు వేసినట్లు పార్టీలో టాక్. ఇదిలా ఉండగా పార్టీ నాయకులపై ఇష్టానుసారంగా టీడీపీ కి అనుకూలంగా ఉండే మీడియా కి ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తూ పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరించడంతో రాజుగారి పొలిటికల్ కెరియర్ కి పూర్తిస్థాయిలో పులిస్టాప్ పెట్టడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” అస్త్రాన్ని వైకాపా అధినాయకత్వం రఘురామకృష్ణం రాజుపై ప్రయోగించబోతుందంట. ఈ క్లాజు ప్రకారం రాజు గారి ఎంపీ పోస్ట్ పోవడం ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి.
మామూలుగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆ పార్టీతో మాత్రమే సస్పెండ్ అయి, ఆ పార్టీతో మాత్రమే ఆ క్యాండెట్ కి సంబంధం తెగిపోది. దీంతో సస్పెండ్ అయిన కాండేట్ స్వేచ్ఛగా ఉన్న పదవితో వేరే పార్టీలో చేరిపోయే అవకాశం ఉండేది. కానీ “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం పార్టీ అధిష్టానం ఏ వ్యక్తి పైన అయితే ఈ క్లాజు ప్రయోగిస్తుందో ఆ వ్యక్తి పార్టీ నుండి సస్పెండ్ అవ్వుతూ పూర్తిగా పదవి కోల్పోయే అవకాశం ఉంది. సరిగ్గా ఇప్పుడు ఇదే సరికొత్త బాణాన్ని రఘురామ కృష్ణం రాజు పై వైయస్ జగన్ ప్రయోగించడానికి రెడీ అయినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి. ఈవిధంగా ప్రయోగించి నర్సాపురంలో ఉపఎన్నికలకు వైయస్ జగన్ వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మూడు నెలలలో నర్సాపురం పార్లమెంటు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యే అవకాశం ఉందని తాజాగా వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ దెబ్బతో రఘురామకృష్ణంరాజు ఎంపీ పదవి మరో మూడు నెలల్లో ఉడిపోయే అవకాశం ఉందని గోదావరి జిల్లాల్లో వార్తలు మొదలయ్యాయి.
ఇదే టైములో మరో పక్క రెండో కోణంలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పరిశీలిస్తే అధికార పార్టీ రాజు గారి దూకుడు పై “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం యాక్షన్ తీసుకోవటం అది అంత సులువైన పని మాత్రం కాదు అని మేధావులు అంటున్నారు. దానికి కారణం కూడా చెబుతున్నారు, అది ఏమిటంటే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం చూసుకుంటే రఘురామకృష్ణంరాజు ఇతర పార్టీ మీటింగ్ లో పాల్గొని అయినా ఉండాలి లేకపోతే ఇతర పార్టీ నాయకులతో కలిసి అయిన తిరగాలి. కానీ రాజుగారి విషయములో అలాంటిదేమీ జరగలేదు. మరో కారణం చూసుకుంటే వైసిపి పార్టీ విప్ దిక్కరించి ఉండాలి. కానీ అది కూడా జరగలేదు. ఈ రెండు విషయాల్లో ఎక్కడైనా రఘురామకృష్ణంరాజు దొరికి ఉంటే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” వర్తిస్తుంది. సో ఇది జగన్ పార్టీ ఈ క్లాజు ప్రయోగించిన స్పీకర్ దీనిని పార్టీ అంతర్గత గొడవగా భావించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో స్పీకర్ ఈ క్లాజు కొట్టేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా అయితే రఘురామకృష్ణంరాజు విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.