అసలే సినిమా పరిశ్రమ క్రైసిస్ లో ఉంది. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే నిర్మాతలకు పెద్ద తలనొప్పే. అయినా కానీ ఆ నిర్మాత అన్నిటికీ రెడీ అంటున్నాడు. ఆ సినిమా కోసం భారీ మొత్తంలో బడ్జెట్ పెడుతున్నాడు. ఆ క్రేజీ నిర్మాతే దిల్ రాజు. ఇప్పటికే వకీల్ సాబ్ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రెండు భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయినా సినిమాని వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్నాడు. కాని అంత బడ్జెట్ ఒక రీమేక్ సినిమాకి దిల్ రాజు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. కాని దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం కల. అందుకే వకీల్ సాబ్ బడ్జెట్ విషయంలో ఆలోచించడం లేదు.
కాగా కరోనా అనంతరం 2021లో ప్రారంభం కాబోతున్న మూవీ ఎఫ్ 3. విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ ఎఫ్ 2 వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు ఎఫ్ 3 కి భారీగానే బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు దిల్ రాజు అని ఇండస్ట్రీ టాక్. కేవలం హీరో హీరోయిన్లు డైరెక్టర్ ల రెమ్యూనరేషన్ కోట్లల్లో ఉందంటే ఈ సినిమాకి దిల్ రాజు ఎంత బడ్జెట్ కేటాయించాడో అర్థం చేసుకోవచ్చు. రెమ్యునరేషన్ విషయం బయటికి రావడంతో ఎఫ్ 3 గురించి ప్రతిదీ హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయానికొస్తే ఈ సినిమాకి వెంకటేష్ కి 12 కోట్ల పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ కి ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నారని టాలీవుడ్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు హీరోయిన్స్ కి దిల్ రాజు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఎఫ్ 2 100 కోట్ల కి పైగానే వసూళ్ళు రాబట్టింది. అందుకే ఇప్పుడు ఎఫ్ 3 ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇదంతా దర్శకుడు అనిల్ రావిపూడి తయారు చేసిన కథ మీద నమ్మకమని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే దిల్ రాజు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ కమర్షియల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.