తుడిస్తే పోతుందనుకుంటే 99 సార్లు తుడుచుకోవడానికైనా నేను సిద్దం. అదే నేనే పోతాననుకుంటే నువ్వు పోతావ్.. నేనింతే సినిమాలో మాస్ మహారాజ రవితేజ చెప్పిన డైలాగ్. అలా నేనే పోవాల్సి వస్తే ఒక్కడినే పోను తోడుగా ఓ 100 మందిని నాతో పాటు తీసుకెళ్తా అన్న మాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రియా వ్యవహారం చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి వ్యవహారం అటు తెగదు ఇటు తెల్లారదు అన్నట్టుగా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రియాకు డ్రగ్స్ డీలర్ లతోనూ సంబందాలున్నట్టు తాజాగా బయటపడటంతో ఈ కేసుని మాదక ద్రవ్యాల కోణంలోనూ విచారించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటికే రియా సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఎన్.సీ.బీ తాజాగా రియాని కూడా విచారించారు.
అయితే ఈ తాజా విచారణలో రియా పలు సంచలన విషయలెన్నో బయటపెట్టినట్టు తెలుస్తుంది. షోవిక్ చక్రవర్తి.. శామ్యూల్ మిరండా.. దీపేష్ సావంత్ లను ఇప్పటికే విచారించిన ఎన్.సీ.బీ తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాని కూడా విచారించగా ఈ సోమవారం రియా చాలా కీలక విషయాల్ని బయటపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తన సోదరుడు షోవిక్ ద్వారా తీసుకున్నానని డ్రగ్ డీలర్ బాసిత్ తనకు ఐదు సార్లు కలిశాడని తనే ఇంటికి వచ్చేవాడని.. కాని తనకు డ్రగ్ అలవాటు మాత్రం లేదంటూ చెప్పుకొచ్చినట్టు సమాచారం.
కాగా ఇక్కడ ఎవరూ ఊహించని షాకింగ్ విషయం ఏంటంటే రియా ఎన్.సీ.బీ అధికారుల ముందు డ్రగ్ అలవాటున్న 18 మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లని బయటపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ స్టార్లెవరన్నది మాత్రం ఇంకా బయటకి తెలియకపోవడంతో బాలీవుడ్ లో ఈ టాపిక్ సంచలనం అవుతుందట. అంతేకాదు ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు కొందరు వణికిపోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రియా దెబ్బ .. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇరికించి వణికించేసిందని చెప్పుకుంటున్నారు.