కర్నూలు జిల్లా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గుడివాడ నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొడాలి నాని తో కలిసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొనటంతో..రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం సంచలనం సృష్టించింది. ఎద్దు బండ లాగుడు పోటీ కి రాష్ట్రంలో మాత్రమే కాక అటు తెలంగాణా నుండి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుండి రక రకాల జాతుల ఎద్దులు రావటం తో పాటు..ఈ పోటీలను తిలకించడానికి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది రావటం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనని ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొడాలి నాని మాటతీరు అంటే తనకు ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అదేవిధంగా ప్రత్యర్థులపై ఆయన మాట్లాడే తీరు ఎంతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో జగన్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నాయకులలో కొడాలి నాని అదే విధంగా అనిల్ కుమార్ యాద వీళ్లంతా మాకు ఆదర్శం అన్నట్టుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పుకొచ్చారు.అదేవిధంగా గుడివాడ అంటే మొదట అతనికి గుర్తొచ్చేది కొడాలి నాని అని పేర్కొన్నారు. గుడివాడ ప్రజలకు ఎంతో మంచి చేయాలని తపన ఉండే కొడాలి నాని గారిని చూసి..నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ స్థాయిలో నాయకుడిగా రాణించాలని తనకి తపన మొదలైనట్టు బైరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చారు.