విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికలలో ఫస్ట్ టైం చంద్రబాబు గెలవగా సెకండ్ టైం జగన్ గెలవడం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చున్న గాని రాబడి లేని రాష్ట్రం పైగా విభజనతో పాటు అప్పుల తో నిండిపోయిన ఏపీ ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రంతో డీలింగ్ విషయంలో చాలా వరకు అభ్యర్థించే రీతిలో వ్యవహరించారు. విభజన చట్టం ప్రకారం న్యాయంగా రావాల్సిన విషయాలను కూడా చంద్రబాబు కొన్ని పరిస్థితుల వల్ల చెయ్యి చాపే రీతిలో వ్యవహరించడం జరిగింది అని చాలా మంది సీనియర్లు అంటారు. దానికి ఎక్కువ కారణం “ఓటుకు నోటు” కేసు అని కూడా ఆరోపిస్తుంటారు.
ఈ విధంగా ప్రతి విషయంలో న్యాయబద్ధంగా ఏపీకి రావలసిన హక్కులను చంద్రబాబు కాల రాశారని ప్రత్యర్థులు అప్పట్లో విమర్శలు చేశారు. కదా ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కూడా అదే విధానం అనుసరిస్తూ ఉన్నట్లు విమర్శలు ఏపీ రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాట ఇచ్చారు, కానీ భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నా గానీ కేంద్రంలో బీజేపీ బలమైన మెజారిటీ తో ఉండే వాళ్లకు మన అవసరం లేదు అంటూ స్పెషల్ స్టేటస్ విషయాన్ని లైట్ తీసుకున్నారు. అదేరీతిలో తాజాగా పోలవరం విషయంలో కేంద్రం చేతులు దులుపుకోవడం తో ప్రశ్నించాల్సిన సమయంలో కూడా జగన్ సైలెంట్ గా ఉండటం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదిలాఉండగా పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉండగా కేంద్రం ముందుకు రాలేదు ఈ విషయంలో చంద్రబాబు అప్పట్లో విజ్ఞప్తి చేయడం జరిగింది కాని ఫలితం కనిపించలేదు. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఏపీ ని మరో 50 నియోజకవర్గాలు పెంచాలనే ప్రతిపాదన ఉంది. అంటే మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయంలో జగన్ చంద్రబాబు మాదిరిగా కేంద్రం వద్ద సరెండర్ అయిపోతారా లేకపోతే సాధిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.