చాలా రకాల పండ్లు సహజం గానే తీపిని కలిగి ఉంటాయి. మామిడి మాత్రం కాయగ ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి. అలాంటి వాటికి కాస్త ఉప్పు, కారం చల్లుకొని లాగించేయడం మనకు అలవాటు. మరి కొందరు జామకాయల్ని కోసి ఉప్పు వేసుకుని , అవసరం అనిపిస్తే కారం కూడా చల్లుకుని తింటారు.
ఈమధ్య కాలంలో పుచ్చకాయల్లో కూడా ఉప్పుని వాడుతున్నారు.. ఉప్పుతో తింటే ఆ రుచే వేరంటున్నారు. అయితే ఈ విషయం నిజమేనట .. పండ్ల పై ఉప్పు చల్లుకుని తింటే రుచి పెరగడం తో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం …
ఉప్పుతో మాత్రమే తినడం కస్టంనిపిస్తే ఉప్పుకి కారం కలిపి వాడుకోవచ్చు. అలా చేసినంతమాత్రాన వాటిపోషకాలు ఏమాత్రం తగ్గవు .మనకు తెలియకుండా నే పండ్ల పై బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని ఉప్పు చంపేయగలదు. అలా అని అన్ని పండ్ల ముక్కలు ఉప్పు తో తినడం మంచిది కాదు. ముఖ్యంగా షుగర్ తో బాధపడే వారు ఉప్పు చల్లుకోవడం మంచిది కాదు. పైగా ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
పుల్లగా ఉండే సిట్రస్ జాతి పండ్ల మీద నిమ్మకాయ, ఉసిరికాయ, పుల్ల మామిడి, దబ్బ కాయ, నారింజ మొదలైనవి ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ లను అడ్డుకో వచ్చు. ఫలితంగా అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. జామ కాయ మీద కొంచెం ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు మేలు కలగడం తో పాటు నోట్లో బ్యాక్టీరియా నశించి పోతుంది .
అస్సలు వీటిగురించి డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా .. మనలో చాలా మంది శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువగానే ఉప్పు తీసుకుంటున్నారు. అందువల్ల పండ్ల వంటివి తినేటప్పుడైనా ఉప్పు వాడకాన్ని మానేయమంటున్నారు. తాజా పండ్లు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి, వాటిని అలాగే తినమంటున్నారు. మన శరీరానికి ఉప్పు అవసరమే… కానీ తగినంత మాత్రమే తీసుకోవాలి .. ఎప్పుడో తప్పితే… రోజూ పండ్ల పై ఉప్పు వేసుకో వద్దని సూచిస్తున్నారు. మనమంచికోసం ఇచ్చిన ఈ సూచన పాటించేద్దాం.
టేస్ట్ కోసం