Lemonade:నీళ్లు సరిపడినన్ని తాగగకపోతే కనీసం ఓ గ్లాసు డు నిమ్మరసాన్నైనా తా గండి.. అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా వేసవి లో నిమ్మరసాన్ని డైట్లోచేర్చుకోవడం చాల అవసరమని తెలియచేస్తున్నారు. చాలామంది పనులలో పడి శరీరానికి తగినంత నీటి ని అందించరు. దీంతో శరీరం లో నీటిశాతంబాగాతగ్గి పోయి ,డీహెడ్రేషన్, కిడ్నీ లో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ చుట్టుముడతాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మ రసం నీళ్లు తాగటం అలవాటు చేసు కుంటే ఒంట్లో నీటి శాతం తగ్గి పోకుండా చాలావరకు అదుపు చేయవచ్చు. పైగా నిమ్మ రసం కిడ్నీ లో రాళ్లు ఏర్పడకుండా కూడా కాపాడుతుంది.
వేసవి లో మూడు నుంచి నాలుగు గ్లాసు ల నిమ్మరసాన్ని తప్పకుండా తీసుకోవాలని. ఇలా చేస్తే డీ హైడ్రేషన్ బారి పడకుండా రక్షణ కలుగుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. అలాగే నిమ్మరసంలోఉండే ఫైటోన్యూట్రియంట్లు, యాంటీఆక్సిడెంట్లుగాకూడా ప్రభావాన్ని చూపుతాయి. ఇవి అధిక మొత్తంలో రిలీజ్ ఆయె కణాల మూలంగా తలెత్తు అనర్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది . వేడి నీటి తో నిమ్మ రసం తీసుకోవడం వలన శరీరం లో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ స్థాయి కూడా మెరుగవుతుంది . ఫలితంగా కిడ్నీ లో ఏర్పడిన రాళ్లు నెమ్మ నెమ్మదిగా కరిగిపోతాయి.
కిడ్నీలో ఉన్న రాళ్ల నే కాదు గాల్ బ్లాడర్లో రాళ్లను కూడా నిమ్మరసం చాల సమర్ధ వంతం గా తరిమికొడుతుంది. ఫలితంగా కడుపునొప్పి సమస్యతగ్గుతుంది . ఇందు కోసం రోజూ వేడి నీటి లో నిమ్మరసం కలుపుకునితాగడం మంచిది.
రోజూ నిమ్మరసం తాగడం వలన జీర్ణాశయ సమస్యలు ఉండవు.ముఖ్యం గా గ్యాస్, ఏసీడీటీ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు చాల తేలికగా మాయమవుతాయి. పరగడుపున వేడి నిమ్మ రసం త్రాగడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగవుతుంది. దీని వలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, సంపూర్ణ ఆరోగ్యం కలగడం తో పాటు, వ్యాదు లకు దూరం గా ఉండ వచ్చు కూడా.