మాస్ మహారాజ రవితేజ అంటే కడుపు చెక్కలయ్యోలా నవ్వులే నవ్వులు. కావలసినంత ఎంటర్టైన్మెంట్. ఎమోషన్స్ కూడా హెవీగానే ఉంటాయి. అయితే గత కొంతకాలంగా ఇవన్ని రెగ్యులర్ అయిపోయి రవితేజ సినిమాలు జనాలకి అంతగా ఎక్కడం లేదు. కిక్ రేంజ్ హిట్ మళ్ళీ దక్కలేదనే చెప్పాలి. ఎన్ని సినిమాలొచ్చినప్పటికి అభిమానులకి కిక్ లాంటి సినిమా ఎప్పుడొస్తుందనే ఆలోచన. ఆ మధ్య రాజా ది గ్రేట్ అన్న సినిమాతో వచ్చి కొంతవరకు తృప్తి పరచాడు. మళ్ళీ వరస ఫేయిల్యూర్స్. అయినా రవితేజ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుతం క్రాక్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇక ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ కిక్ సినిమా తరహాలో రాసుకున్నారని.. కిక్ కి మించిన కామెడీ టైమింగ్ తో రవితేజ క్యారెక్టర్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ లో టాక్. ఇక దర్శకుడు త్రినాథరావ్ నక్కిన సినిమాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ ఫుల్ ఎంటెర్టైమెంట్ తో రూపొంది జనాలని బాగానే ఆకట్టుకున్నాయి. కామెడీ సినిమాలు బాగా తీయగల సత్తా త్రినాథరావ్ కి ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ, కరోనా వల్ల ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. కరోనా అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వం లో కూడా ఒక సినిమా కమిటయ్యాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయి.