చాలా మంది మొహం మీద వచ్చే మొటిమలు, మచ్చలు, కంటి కింద వలయాలు తగ్గించుకోవాలి అని కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగిస్తుంటారు. అందులో భాగమే మొహానికి టూత్పేస్ట్ రాయడం. ఇలా టూత్పేస్ట్ రాస్తే సమస్య తగ్గుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో ప్రచారం జరుగుతోంది.ఈ చిట్కా ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోకుండానే మొటిమలతో ఇబ్బంది పడేవారు టూత్పేస్ట్ ముఖం పై అప్లై చేస్తున్నారు.. దీనివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
చర్మ వ్యాధి నిపుణులు మాట్లాడుతూ మొటిమలకు టూత్ పేస్ట్ వాడవద్దు అని అలా వాడడం చర్మానికి హానికరమని తెలిపారు. చాలామంది టూత్పేస్ట్ వల్ల ముఖంపై మొటిమలు పోతాయిఅని భావిస్తున్నారు. కానీ టూత్ పేస్ట్ వలన చర్మం ఇరిటేట్ కి గురవుతుంది అని తెలిపారు. దీనిలో ఉండే కాల్షియం కార్బోనేట్ గోడలకు వేసే సిమెంట్, సున్నం ప్లాస్టర్లో కూడా ఉంటుంది. మొటిమలపై పేస్ట్ రాస్తే అక్కడ చర్మాన్ని అది మరింత చికాకు పెడుతుందని దాని వల్ల మచ్చలు ఏర్పడతాయని వైద్యులు తెలియచేస్తున్నారు.
అయితే ఇది చాలా చెత్త చిట్కా అని చర్మ వ్యాధి నిపుణులు తెలిపారు.ఎవరైతే ఇలా మొటిమలకు టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తున్నారో వారు ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవాలి అని సలహా ఇస్తున్నారు నిపుణులు. అంతే కాదు టూత్పేస్ట్లో సల్ఫర్ ,మెంథాల్,సోడా, షాంపూ, లు ఉంటాయి. వీటిని దంతాలకు రాస్తాం దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటికీ ఏమి కాదు.. కానీ ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన టూత్ పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా సమస్య తగ్గినా, భవిష్యత్తులో దానికి సంబంధించిన ఇబ్బందులు మాత్రం తప్పవు. పేస్ట్లోని కెమికల్స్ ముఖంపై చర్మాన్ని పొడి బార్చడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ టూత్ పేస్ట్ ముఖంపై రాయడం మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.