NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పాలన ఇక ఛలో విశాఖ..! ముహూర్తం ఫిక్స్..!! భవనాలు సిద్ధం..!?

విశాఖ పరిపాలనా రాజధానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఉగాది నుంచి వైజాగ్‌ నుంచి పాలన సాగుతుందని మంత్రులు చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి‌.

రుషికొండలోని ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్‌ రాజధాని నిర్వహణ కోసం సిద్ధమవుతున్నాయి. సాగర నగరం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు వీలుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఉగాది నుంచి విశాఖలో పాలన సాగుతుందని బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనలకు అనుగుణంగా మౌలికసదుపాయాల కల్పన జరుగుతోంది.

హరిత రిసార్ట్స్ లో సెక్రటేరియట్!

విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్‌లో నగరానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని రుషికొండ ఏపీ టూరిజం హరిత కాటేజీలు పాలనా కేంద్రంగా మారే అవకాశం ఉంది. అమరావతి నుంచి తరలివచ్చే ప్రభుత్వం కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. వచ్చే నెల నుంచి ఈ కాటేజీలను ఎవరికీ కేటాయించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీనిలోని విహారి రెస్టారెంట్‌ను కూడా మూసివేయాలని నిర్ణయించింది.హరిత రిసార్ట్స్‌ ఉన్న రుషికొండ ప్రాంతం 108 ఎకరాల్లో విస్తరించివుంది. ఎకరాల్లో 15 ఎకారాలను అభివృద్ధి చేసి.. 55 కాటేజీలు నిర్మాణం జరిగింది. ఎదురుగా బీచ్‌.. ఎటుచూసినా పచ్చిన కొండలతో ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు రుషికొండ హరిత రిస్టార్స్‌ను పరిశీలించి వెళ్లారు. పరిపాలనా రాజధాని కోసం ప్రైవేటు భూములను తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో హరిత రిసార్ట్స్‌ నుంచి కొంత కాలం పాలన సాగే అవకాశం ఉంది.

గవర్నర్ బంగ్లా గా వాల్తెరు క్లబ్!

త్వరలోనే రుషికొండ ఐటీ పార్క్‌లోని భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాపులుప్పాడ తొట్లకొండలోని 30 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద గెస్ట్‌ హైస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది.ప్రస్తుతం విజయవాడలో ఉన్న రాజ్‌భవన్‌ కూడా విశాఖ తరలిరానుంది. నగరం నడిబొడ్డున ఉన్న వాల్తేర్‌ క్లబ్‌ను గవర్నర్‌ బంగ్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పదమూడు ఎకరాల విస్తీర్ణంలోని వాల్తేర్‌ క్లబ్‌ రాజ్‌భవన్‌కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దానిలోని భవనాలతో పాటు ఖాళీ స్థలం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. క్లబ్‌ యాజమాన్యం, నిర్వాహకుల మధ్య నడుస్తున్న వివాదానానికి త్వరగా ముగింపు పలకాలన్న లక్ష్యంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది. మొత్తంమీద ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ఉగాది నుండి విశాఖలో పాలనా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!