ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి మందు వచ్చిన సంగతి తెలిసిందే. మందు వచ్చేసింది కదా వెంటనే వేసుకుందాం అనుకుంటున్నారా? జర ఆగండి. ఈ మందు వాడాలంటే చాలా ప్రాసెస్ ఉంది. కరోనా నివారణ టాబ్లెట్ లను నేరుగా మందుల షాపుకు వెళ్లి అడిగితే ఇవ్వరు. వైద్యుడి సూచనలు లేకుండా ఈ టాబ్లెట్ లు వేసుకుంటే ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ టాబ్లెట్ లను మందుల షాప్ లో ఇస్తారు.
భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదంతో భారత ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్. ఫాబిబ్లూ పేరిట మార్కెట్ లోకి విడుదల చేసిన కరోనా వైరస్ టాబ్లెట్ లను స్వల్ప, మధ్యస్థ స్టేజ్ లో కరోనాతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే వెంటిలేటర్స్ పై సీరియస్ కండిషన్ లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో పనిచేయక పోవచ్చట.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఒక్కో టాబ్లెట్ ధర రూ.103 అని ఇంతకు ముందుగానే వెల్లడించింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వారు తొలిరోజు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రెండు సార్లు వేసుకోవాలి, ఆ తర్వాత 14 రోజుల పాటు 800 ఎంజీ డోస్ ఉన్న మాత్రలను రోజుకు రెండు సార్లు వేసుకోవాలని కంపెనీ అధికారులు సూచించారు. మధుమేహ, హృద్రోగ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఈ మందు పనిచేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో రోజుకు 13వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నేటి వరకు 4 లక్షల 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 2లక్షల 27మంది కోలుకున్నాను. 13,254 మంది కరోనాతో మృతి చెందారు. ఈ తరుణంలో కరోనా కట్టడికి ఔషధం మార్కెట్ లోకి రావడం శుభపరిణామం.