టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు తేజ కరోనా బారినపడ్డారు. కొద్దిరోజుల క్రితమే తేజ కరోనా పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియో చేశారు.
అందులో ఎవరిని నమ్మొద్దని ఎక్కడికి వెళ్ళొద్దని… కరోనా ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పారు. కొద్దిగా నిర్లక్ష్యం వహించినా కూడా ఈ మహమ్మారి బారిన పడి ఇబ్బందిపాలు అవుతామని చెప్పారు.మనకి వైరస్ లేదని అవతల వారికి కూడా లేదని అనుకోవద్దని పేర్కొన్న ఆయన చివరికి ఈ మహమ్మారి బారిన పడడం ఆశ్చర్యకరం.
తాజాగా తేజకు కరోనా పాజిటివ్ అని రావడంతో సినీ వర్గాలు అప్రమత్తమయ్యాయి అతని కాంటాక్ట్ లిస్టు మొత్తం బయటకు తీస్తున్నారు. జరపబోయే టెస్టుల రిజల్ట్స్ వచ్చాక అందుకు తగ్గట్లు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి తన కుటుంబంతో సహా కరోనా బారిన పడటం గమనార్హం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?