న్యూఢిల్లీ : నాల్గొవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 6566 కేసులు నమోదు కాగా, 194మరణాలు సంభవించాయి. గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,58,333కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 4531 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా మరో 86,110మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనక రస్థాయిలో కొనసాగుతుండగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు మహమ్మారి తీవ్రత పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో...
ఏపిలో గడిచిన 24 గంటల్లో 9,858 మంది నమూనాలు పరీక్షించగా..54 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,814కి చేరింది. కరోనాతో నేడు కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 59కి చేరుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1958 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. మరో 824 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 54 కేసుల్లో నాలుగు కోయంబేడు కాంటాక్టు కేసులుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?