న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5,611 కేసులు నమోదు కాగా, 140 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి చేరగా, ఇప్పటి వరకు 3,303 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 42,298 మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా మరో 61,149 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఒకే రోజు భారీ స్థాయిలో 5,611 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ప్రధమం. మహారాష్ట్ర, తమిళనాడు, డిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?