న్యూఢిల్లీ : దేశంలో లాక్ డౌన్ 4వ విడత కొనసాగుతున్నా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,609 కేసులు నమోదు కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కు చేరుకున్నాయి. 45,299 మంది కోవిడ్ 19 నుండి చికిత్స పొంది కోలుకోగా, ప్రస్తుతం 63,625 మంది చికిత్స పొందుతున్నారు.దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 3,435కు చేరుకున్నది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 39,297 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 13,191, గుజరాత్లో 12537, ఢిల్లీలో 11,088, రాజస్థాన్లో 6,015, మధ్యప్రదేశ్లో 5,735, ఉత్తరప్రదేశ్లో 5,175, పశ్చిమ బెంగాల్లో 3,103, ఆంధ్రప్రదేశ్లో 2,452, పంజాబ్లో 2,005, బిహార్లో 1674, తెలంగాణలో 1,661 కేసులు నమోదయ్యాయి.
previous post