దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3525 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 122 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,281కి చేరగా 2415 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 24,386 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 47,480 మంది కరోనా వైరస్ పాజిటివ్తో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కేసుల నమోదు తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 24,427 చేరగా 921 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తరువాత స్థానంలో గుజరాత్ నిలిచింది. ఈ రాష్టంలో 8,903 పాజిటివ్ కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,639, మృతులు 86, మధ్యప్రదేశ్ లో 3,986 (225), రాజస్థాన్ లో 4,126 (117), పంజాబ్ లో 1,914 (32), హర్యానాలో 780 (11) బీహార్ లో 831 (6), తమిళనాడులో 8,718 (61), కేరళలో 524 (4), ఉత్తర్ ప్రదేశ్ లో 3,664 (82), తెలంగాణలో 1,326 (31), ఆంధ్రప్రదేశ్ లో 2,090 (46), ఒరిస్సాలో 437 (3), కర్ణాటక లో 925 (31) పాజిటివ్ కేసులు, మృతులు నమోదు అయ్యాయి.