ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ముఖ్యంగా ప్రతీ రోజు నమోదు అవుతున్న కేసులు మరియు మరణ సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 491 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 8,452 మందికి వైరస్ సోకగా 101 మంది మృతి చెందారు. దీనితో ఏపీ ప్రభుత్వం మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. ప్రజలను కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అన్ని వయస్కుల్లో కన్నా 40 నుంచి పై బడిన వారు మాత్రం తప్పకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. గత కొన్ని రోజుల్లోనే ఆ వయసుకు చెందిన వారు మాత్రమే 30 మందికి పైగా చనిపోయారు. దీనితో ఇక నుంచి ఈ వయసు పైబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిఎస్ జవహర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
మరో పక్క కేసుల తీవ్రత దృష్యా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేస్తుండగా జిల్లాల్లోని ప్రాంతాల వారీగా కేసుల పెరుగుదల ఆధారంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.