Breaking: దక్షిణాది సినిమా రంగంలో ప్రముఖ దర్శకులలో ఒకరు మణిరత్నం. రొమాంటిక్ కథతో చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ సినిమాలు చేసే దర్శకుడిగా పేరొందిన మణిరత్నం ప్రస్తుతం..’పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న టైం లో ఒక గుర్రం చనిపోవడంతో.. మణిరత్నం పై పెటా ప్రతినిధులు కేసు నమోదు చేశారు.
సినిమా షూటింగ్లో భాగంగా యుద్ధం సన్నివేశం చిత్రీకరణ.. ఏకదాటిగా జరగటంతో డీహైడ్రేషన్ కారణంగా గుర్రం చనిపోవడంతో డైరెక్టర్ మణిరత్నం పై అభివృద్ధిలో నిర్మాణ సంస్థపై మరియు గుర్రం యజమానిపై పెటా ప్రతినిధులు కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.