అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కమెడియన్గా మంచి పాత్ర పోషించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్పై తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పాల్పై కేసు నమోదు చేశారు.
అమెరికా పంపిస్తానంటూ తనను మోసం చేశారనీ పాల్పై ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు స్పాన్సర్షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు పాల్ ఇచ్చారనీ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కెఎ పాల్ నర్సాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయం పాలయ్యారు.