హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్ నేతపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. నారాయణగూడ నుంచి నల్లకుంట వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారహక్కు కార్యకర్త విజయ్ గోపాల్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమతి లేకుండా డివైడర్లపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు టీఆర్ఎస్ నేత శ్రీనివాస గౌడ్పై ఐపీసీ 268, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
previous post