(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఆరుగురు రిటైర్డ్ ఐపిఎస్ ,ఐఏఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపిఎస్లు, నలుగురు ఐఏఎస్లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
విశ్రాంత ఐఏఎస్లు ఎస్వి ప్రసాద్, పికే మహంతి, రత్న ప్రభ, విద్యాసాగర్, విశ్రాంత ఐపిఎస్ దినేష్ రెడ్డి, సిఎస్ఆర్కెఎల్ఎన్ రాజుపై కేసులు నమోదు అయ్యాయి. ఐపిసి 201, 203, 204, 213, 193, రెడ్ విత్ యాక్ట్ 34, 120 b, సిఆర్పిసి 156 (3) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కేసులో కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ నాంపల్లి కోర్టును వత్స అనే మహిళ ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదు చేశారు.