R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్ధి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ కృష్ణయ్యపై కీలక ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ పరిధిలోని తన భూమిని ఆర్ కృష్ణయ్య కబ్జా చేయడంతో పాటు తనను హత్య చేసేందుకు యత్నించారని పిటిషన్ లో పేర్కొన్నారు. కొందరు రౌడీలను పంపి తనను బెదిరించారని ఆయన ఆరోపించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
R Krishnaiah: కోర్టు ఆదేశాలతో
ఈ పిటిషన్ ను విచారణ చేపట్టిన కోర్టు..ఆర్ కృష్ణయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆర్ కృష్ణయ్య తో పాటు మరి కొందరిపై ఐపీసీ 447, 427, 506, 384, రెడ్ విత్ 34 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
రాజకీయ ప్రేరేపిత కేసు
కాగా దీనిపై ఆర్ కృష్ణయ్య స్పందిస్తూ ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా పేర్కొన్నారు. తాను 40 ఏళ్లుగా భాదితుల పక్షాన పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి చాలా మంది వద్ద బెదిరించి డబ్బులు వసూలు చేసాడని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య.