వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ టీడీపీ మాజీ మంత్రులపై ఆరా తీస్తూనే ఉంది. ఎక్కడ ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వరకూ కొనసాగుతోంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో మాజీ టీడీపీ నాయకుడు వరపుల రాజాపై అవినీతి ఆరోపణల వస్తున్నాయి. సహకార సంఘంలో 16కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో వరపుల రాజా పాత్ర ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పరపుల రాజాపై ఆరోపణలు ఇవే..
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం సహకార సంఘం లంపకలోవ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు వరుపుల రాజా గతంలో అధ్యక్షుడిగా పని చేశారు. రాజా హయాంలో 11.05.2018 – 30.07.2019 మధ్య కాలంలో రూ.16,47,59,023 కోట్ల మేర దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలు వచ్చాయి. దీనిపై పెద్దాపురం డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణా రావు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో రాజాపై క్రిమినల్ కేసు నమోదు అయింది. రాజాతోపాటు మరో నలుగురు అధికారులు, ఇద్దరు మాజీ సీఈఓలు, ఇద్దరు మాజీ బ్రాంచి మేనేజర్లను కూడా సహ నిందితులుగా పేర్కొన్నారు. అడ్డగోలుగా రుణాలు మంజూరు, ఒకే పేరుపై అనేక రుణాలు, మృతుల పేర్లపై రుణాలు, 450 నకిలీ పాస్ పుస్తకాలపై రుణాలు మంజూరు చేశారంటూ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాజా హయాంలోనే ఇవి జరిగాయని అంటున్నారు. దీంతో రాజా అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.
మరింత లోతుకు తవ్వుతున్నారు..
ఇప్పటివరకూ జరిగిన అరెస్టులతోపాటు ఇకపై కూడా మరిన్ని అరెస్టులు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రుల నుంచి జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల వరకూ వీరిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జరిగిన అవినీతి పనులపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారం అండతో ఆనాటి టీడీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని నియోజకవర్గాల స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీడీపీ మాజీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటివరకూ జరిగిన అరెస్టులు.. ఇకపై ఎన్ని అరెస్టులు జరుగుతాయోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.