అవినీతి ఆరోపణల నేపథ్యంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బీఎస్ ఝా సహా ఆరుగురిని సీబీఐ అరెస్టు చేసింది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుండి లంచం తీసుకుని అనుకూలంగా వ్యవహరించాన్న అభియోగం నేపథ్యంలో ఈడీ ఝాను గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశ్ రాజ్ పాఠక్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ సింగ్ సహా మరో ముగ్గురిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.
గాజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఢిల్లీ సహా మరి కొన్ని ప్రాంతాల్లో నిన్న సీబీఐ సోదాలు జరిపింది. గురుగ్రామ్ లోని ఝాకు చెందిన కార్యాలయంలో రూ.93 లక్షల నగదును సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది. ఝా ప్రస్తుతం ఈటా నగర్ లో విధులు నిర్వహిస్తున్నారు. లంచం తీసుకుని టాటా ప్రాజెక్టుకు ఝా ప్రయోజనం చేకూర్చారని సీబీఐకి సమాచారం అందడంతో ఆయనపై నిఘా పెట్టి ముడుపులు చెల్లించే రహస్య ప్రదేశంలో బుధవారం దాడులు చేపట్టి నిందితులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నేడు పంచకులా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?