Obulapuram Mining Case: ఓబులాపురం గనుల మైనింగ్ (ఓఎంసీ) కేసులో నిందితులకు సీబీఐ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసుల నుండి తొలగించాలన్న తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అదే విధంగా ఓఎంసీ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్, విశ్రాంత అధికారులు కృపానందం, విడి రాజగోపాల్, గాలి జనార్థన్ రెడ్డి పీఏ అలీఖాన్ డిశార్జ్ పిటిషన్ లను కూడా సీబీఐ కోర్టు కొట్టేసింది.
ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి తన డిశ్చార్జ్ పిటిషన్ ను గతంలోనే ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. అభియోగాల నమోదుపై విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ కేసు విచారణ ప్రారంభించకపోవడాన్ని ఇటీవల సుప్రీం కోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో ఓఎంసీ కేసు విచారణ ప్రక్రియ వేగవంతం అయ్యింది.
TS High Court: ఫ్రీ సింబల్స్ పిటిషన్ పై హైకోర్టులో టీఆర్ఎస్ కు లభించని ఊరట .. రేపు విచారణకు అనుమతి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?