CBI : వైయస్ జగన్ సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ మొన్నటి వరకు విచారణ చేసిన సంగతి తెలిసిందే.
వైయస్ వివేకానంద రెడ్డి కూతురు హైకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీబీఐ బృందాలు కడప జిల్లాలో హత్యకు సంబంధించి అనుమానితులను కడప సీబీఐ ఆఫీస్ లో విచారించడం జరిగింది. కరోనా సమయంలో కూడా విచారణ చేయడంతో చాలా మంది సీబీఐ అధికారులకు వైరస్ సోకటం తో దర్యాప్తు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే మళ్ళీ మొదటి నుండి దర్యాప్తు ప్రారంభించడానికి తాజాగా సీబీఐ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటికే వివేకా కూతురు డాక్టర్ సునీత.. ఢిల్లీ వెళ్లి సీబీఐ ఉన్నతాధికారులను కలవటం మాత్రమే కాక ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ను కూడా కలిసి కేసు వివరాలను చర్చించారు. తొందరగా కేసు పరిష్కారం అవ్వటంలో సహకారం అందించాలని అడిగారు. సునీత విజ్ఞప్తి మేరకు జోమున్ పుతెన్ను కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదిలా ఉంటే మానవ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ను అప్పట్లో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లు, త్వరలో బయటపెడతానని చెప్పటం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కలవడం సంచలనంగా మారింది. త్వరలోనే సి.బి.ఐ మళ్లీ మొదటి నుండి విచారణ చేపట్టనున్నట్లు తాజా పరిణామాలను బట్టి వార్తలు వినబడుతున్నాయి.