టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ఈ ఉదయం నుండి సోదాలు జరుపుతున్నారు. స్థానిక పోలీసు అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారుల బృందం పెనుగొండ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండటంతో స్థానికంగా కలకలాన్ని రేపింది. సబిత భర్త రైల్వే కాంట్రాక్టర్ గా ఉన్నారు. రైల్వే కాంట్రాక్ట్ లలో జరిగిన అవకతవకలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో నమోదైన కేసు విషయంలో సీబీఐ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
సీబీఐ అధికారుల తనిఖీల నేపథ్యంలో సవిత గృహంలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తొంది. కొన్ని రికార్డులతో పాుట కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి టీడీపీ నేతగా ఉన్న సవిత నివాసానికి ఒక్క సారిగా సీబీఐ బృందాలు చేరుకుని తనిఖీలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కేటిఆర్ చెప్పినట్లు పాన్ ఇండియా మువీ చూపించిన సీఎం కేసిఆర్… బీజేపీపై చాలా ఘాటుగా