CBI: నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐతో ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో మరో కీలక పరిమాణం చేటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. జోధ్పూర్ లోని ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించి పలు ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
2007 -2009 మధ్య పెద్ద మొత్తంలో ఫర్టిలైజర్ ను అక్రమంగా ఎగుమతి చేశారన్న అభియోగంపై అగ్నసేన్ గెహ్లాట్ పై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రసేన్, ఆయన సంస్థ అనుపమ్ కృషి, మరి కొందరిపై ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా అగ్రసేన్ గెహ్లాట్ పై అవినీతి కేసును నమోదు చేసిన సీబీఐ ..ఇవేళ సోదాలు జరిపింది. అయితే సీబీఐ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ చేత బీజేపీ దాడులు చేయిస్తొందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.