అమరావతి: విశాఖపట్నంలో ఉన్న రెండవ అదనపు సిబిఐ కోర్టును రాయలసీమలోని కర్నూలు జిల్లాకు తరలిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు.
ఎపి హైకోర్టు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్టు రాయలసీమలోని నాలుగు జిల్లాలను కవర్ చేయనున్నది.
హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసిపి ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రాజధాని ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.